Raithanna Meekoasam : నందిగామలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం

TRINETHRAM NEWS
'Raithanna Meekoasam' program

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులతో కలిసి పాల్గొన్నారు

Raithanna Meekoasam : నందిగామ, మార్చి 17: నందిగామ పట్టణం పరిధిలోని హనుమంతుపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘రైతన్న మీకోసం‘ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఆమె రైతుల సమస్యలను సమీక్షించారు.

రైతులతో సంభాషణ, భూమి పరిశీలనలో భాగంగా తంగిరాల సౌమ్య రైతులతో నేరుగా సంభాషించారు. వారి పొలాల్లోకి వెళ్లి భూమి పరిశీలన చేశారు. పంటల వివరాలు, సాగు సమస్యలు, నీటి సదుపాయాలు, ఎరువులు, దిగుబడి వివరాలపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, అన్నదాత సుఖీభవ, ఇతర సబ్సిడీలు, ఆర్థిక సహాయాలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. రైతు కుటుంబాలకు సంబంధిత కరపత్రాలను స్వయంగా అందజేసి, ప్రభుత్వ హామీలను సకాలంలో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తంగిరాల సౌమ్య, “ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో రైతాంగం సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత. ‘రైతన్న మీకోసం’ వంటి కార్యక్రమాల ద్వారా రైతుల సమస్యలను గుర్తించి, వారికి భరోసా కల్పిస్తున్నాం. హనుమంతుపాలెం గ్రామ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్,డీసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, రైతు నేతలు, కౌన్సిలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, స్థానిక రైతు సంఘాల నాయకులు, గ్రామ అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top