
Minister Lokesh : ఎన్టీఆర్ జిల్లా : మార్చి 17: (త్రినేత్రం న్యూస్); మైలవరం నియోజకవర్గం, మండల పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఇటీవల మధ్యాహ్నం భోజనం బాగోలేదంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో తనిఖీచేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్ అందిస్తున్నటువంటి భోజనం నాణ్యత పై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని చెప్పారు. ఘటన జరిగిన రోజు , అంతకుముందు ఎలా ఉందని వాళ్లను మంత్రి అడిగారు.

