త్రినేత్రం న్యూస్ : న్యూ ఢిల్లీ : మహిళలకు తప్పనిసరి నెలసరి సెలవు పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే మహిళలకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయంది. ఒకవేళ అలాంటి చట్టాన్ని తీసుకొస్తే యాజమాన్యాలు వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆ చట్టంతో తాము పురుషుల కంటే తక్కువనే మానసిక భయాన్ని మహిళల్లో సృష్టిస్తుందన్నారు. నెలసరి సెలవుల నియమాలు రూపొందించడానికి రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని న్యాయవాది శైలేంద్ర త్రిపాఠి ఈ పిటిషన్ వేశారు.


