BRS party : అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో రోజు రోజు కు జోష్ పెంచుతున్న బి.ఆర్.ఎస్ పార్టీ.

TRINETHRAM NEWS

అశ్వారావుపేట సమరం: దూసుకుపోతున్న కారు-సైకిల్ కూటమి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల వేళ పట్టణంలో రాజకీయం వేడెక్కింది.బి.ఆర్.ఎస్ మరియు టి.డి.పి పార్టీల మద్దతుతో అశ్వారావుపేట మున్సిపాలిటీ బరిలో నిలిచిన 22 మంది వార్డు కౌన్సిలర్ సభ్యులు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు మరియు అభిమానులతో కలిసి అశ్వారావుపేట లోని ప్రధాన రహదారీ నందు షాప్ టూ షాప్ ప్రచారం నిర్వహించిన, మాజీ ఎమ్మెల్యే మెచ్చ. నాగేశ్వర రావు.మాజీ ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి, బరగడ.కృష్ణా,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక.ప్రసాద్, పట్టణ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ,మండల నాయకులు జూపల్లి.

రామారావు, పద్మజ, కాసాని. చంద్రమోహన్,నాని, కాట్రం.స్వామి దొర, వగ్గెల.పూజా, మోహన్ రెడ్డి,అంకత.మల్లికార్జున రావు,చైర్మన్ అభ్యర్థి.కాసాని.నాగ శేష పద్మ, నారం.రాజా శేఖర్, మోటూరి.మోహన్, పాలవలస జీవన రావు, సోయం.వీరభద్రం,అఖిల్, శెట్టిపల్లి.రఘురామ్, సోమని.

రమేష్,రెండు పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా ఇంటింటికీ తిరుగుతూ,అభివృద్ధి కోసం తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ముఖ్య నాయకులు వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి గాని సెంటర్ లైటింగ్ ఏ గాని డిగ్రీ కాలేజీ ఏ గాని ఏ సంక్షేమ పథకమైన బి.ఆర్.ఎస్ ప్రభుత్వం లోనే అమలు అయ్యాయని. 6 గారంట్రీలు అన్నారే తప్ప అందులో సగం కూడా అమలు కాలేదని ఏ పథకం అమలు అవ్వాలన్నా బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS party is increasing its enthusiasm day by day

You cannot copy content of this page

Scroll to Top