Vikarabad News : మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఇండ్లపై దాడి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. పౌరహక్కుల సంఘం తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకుల ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరేస్టును తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ.
ఈనెల 23 వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండ్ల అంబయ్య. పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్క బాలయ్య, లింగాల మండలం రాయవారానికి చెందిన మని శెట్టి యాదయ్యలా.
ఇండ్లపై అర్ధరాత్రి రాష్ట్ర ఇంటలిజెన్సీ పోలీసులు వెళ్లి సోదాల పేరుతో కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా వారిని అరెస్టు చేసి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం అప్రజా స్వామీకం పాలకవర్గాలు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా నియంతత్వాన్ని అమలుపరుస్తూ.

ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ పరిధిలో ప్రశ్నించే మేధావులపై రచయితలపై ప్రజాసంఘాల నాయకులపై అక్రమంగా ఉపా కేసులు పెట్టి వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నావని చెప్పి ఈ ఇలా అరెస్టు చేసి బెల్ రాకుండా ఏండ్ల తరబడి జైల్లో బంధించడం రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా ప్రజల ప్రశ్నించే హక్కులపై దాడిగా భావిస్తున్నాం అదే సందర్భంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను స్వయంగా ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ ఏడవ గ్యారెంటీ భావప్రకటన స్వేచ్ఛ ఏమైంది రాష్ట్రంలో ఈ అక్రమ అరెస్టులు ఎందుకని BRS.

BJP ప్రభుత్వాలు అమలు చేసిన నిర్బంధాన్ని రేవంత్ రెడ్డి పాలన అమలు చేయడన్నీ విరమించుకోవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ పక్షాన ప్రశ్నిస్తున్నాం ఈ హక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తూ వెంటనే అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను విడుదలచేయాలని. ఉపా చట్టాలను పుర్తిగా రద్దు చేయ్యాలి రాష్ట్ర ప్రభుత్వాం ఎడవ గ్యారంటీ. భావప్రకటన స్వేచ్చను. ప్రజస్వామ్యన్ని. రాజ్యాంగాన్ని.
నిస్వార్థంగా పాలకులు అధికారులు యంత్రాంగం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రశ్నించే వారిని అక్రమ అరేస్టులు చేసి క్రూరమైన ఉపా కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విలువలు పౌరహక్కులు అనిచివేడమే అవుతుంది ప్రజలు ప్రజాస్వామిక వాదులు విద్యార్థులు మేధావులు బుద్దిజివులు పౌరసమాజం యువత అన్ని మహిళా సంఘలు ప్రతిపక్షలు తడిత పిడిత అనగరిన ‌సంబండ వర్గాల ప్రజలు ఈ అక్రమ అరేస్టును తీవ్రంగా ఖండించాలని కోరుతుంది.
ప్రజాస్వామిక తెలంగాణ వుద్యమవందనలతో. తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం ఉపాధ్యక్షుడు. క్రిష్ణ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Attack on houses alleged to have links with Maoists

You cannot copy content of this page

Scroll to Top