Trinethram News : కేరళ : కేరళలోని శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎదురుచూసే మకరజ్యోతి దర్శనం ఘనంగా జరిగింది.
సాయంత్రం పొన్నంబలమేడుపై మకరజ్యోతి వెలుగులు స్పష్టంగా దర్శనమిచ్చాయి. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తారు.
ఈ సందర్భంగా మూడుసార్లు మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో శబరిమల కొండలు “స్వామియే శరణం అయ్యప్ప” నామస్మరణతో మార్మోగాయి. భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


