తేదీ : 27/11/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా , గోలు కొండ మండలం, చోద్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి చదవలేక చనిపోతున్నాను అంటూ తన తమ్ముడు ఫోనుకు మెసేజ్ పంపాడు. ఆ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన తండ్రి రెండు సంవత్సరాల క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్ళగా , తల్లికి మాటలు రాకపోయినా, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


