త్రినేత్రం న్యూస్ : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని గొల్ల గ్రామంలో ఈరోజు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు
ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటల్లు ప్రజలను దోచుకుని తింటున్నాయని ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేకనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ కి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ ఉండాలని దృఢ సంకల్పంతో నిర్మాణం మొదలు పెట్టారని కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చలించక 5 కాలేజీల నిర్మాణo పూర్తి చేశారని, ముఖ్యమంత్రి అంటే ప్రజల ఆస్తికి రక్షకుడని అలాంటిది చంద్రబాబు ప్రజల ప్రాణాలకు భక్షకుడిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేసి ప్రజలకు ఉచిత వ్యాధిన్ని దూరం చేస్తున్నారని అన్నారు,నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రన్ని పరిపాలన చేసిన చంద్రబాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఏ ఒక్క పథకo అయినా గుర్తు చేసుకోగలరా అని ఎద్దెవా చేశారు,గత ఐదు సంవత్సరల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి అప్పుకి మరియు పేద ప్రజలకు అందించిన పథకాలకి ప్రతి ఒక్కదానికి తమ దగ్గర లెక్కలు ఉన్నాయని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల గడవక ముందే 2 లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎవరికి పంచారు ఏ పేదవాడికి ఇచ్చారో ప్రజలకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు
*ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నక్కా నగేష్,గిరజాల బాబు,తోకల వీర వెంకట్రావు,కొండపల్లి పట్టియ్య,టేకి శ్రీను,తోకల శ్రీను,తాతపూడి బాబీ,ముసునూరి రాంబాబు,కట్టుంగ నాగరాజు,తాడాల చక్రవర్తి,ఈలి గోపాలం,కొత్తపల్లి శివాజీ,విప్పర్తి ఫణి,కట్టా జామిందర్,పితాని హరికృష్ణ,చింతపర్తి రాంబాబు,సర్కార్ బాషా,ఊటికూరి శైలజ,ఆచంట మారుతీ దేవి,వీణం దేవి,దాసరి శేషగిరి,నమాల బాల సరోజిని,మార్గాని బలరామ్,చిలుకూరి రామకృష్ణ,కొప్పాక రమణ,ముద్దాల అను,ముత్యాల పోసి కు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


