Trinethram News : Nov 12, 2025, దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోని ఎయిర్పోర్టులను పేల్చి వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ జాబితాలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమై, నగరంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా బస్ స్టాప్లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్లో, రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. బాలా నగర్ పీఎస్ పరిధిలోని షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్ స్టాప్లలోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


