జూలై 16, 2026
TRINETHRAM NEWS

అశ్వారావుపేట లో విలేఖరి పేరుతో వసూళ్ల దందాల కు పాల్పడిన ప్రెస్ రిపోర్టర్లు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం.సోమవారం. రోజు నారాయణపురం కాలనీ గ్రామానికి చెందిన పట్టేల మంగ అనే గిరిజన మహిళను మూడు సంవత్సరాల క్రితం కోర్టులో కొట్టేసిన కేసు పేరుతో నేను సత్తుపల్లి విలేకరిని అని చెప్పి, అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామానికి. చెందిన పెనుగొండ సత్యనారాయణ. నారాయణపురం గ్రామానికి చెందిన. జక్కుల రాంబాబు. అనే ఇద్దరు విలేకరులు.భయపెట్టి 30000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి ఇస్తే మీ మీద ఎటువంటి కేసు లేకుండా కోర్టులో పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మీ పాతకేసులు మళ్లీ తిరగవేస్తారు.

అని బెదిరించి.దోపిడీ చేసిన ప్రెస్ రిపోర్టర్ల పై సోమవారం రోజున కేసు నమోదు కాగా ఈరోజు పెనుగొండ సత్యనారాయణ డి ఎన్ బి న్యూస్ రిపోర్టర్ ను నేను మా సిబ్బంది అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం దమ్మపేట కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడం జరిగిందని. ఈ కేసులో మరో ముద్దాయి అయిన నారాయణపురం గ్రామానికి చెందిన.జక్కుల రాంబాబు, సూర్య ప్రెస్ రిపోర్టర్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నామని ఎస్సై యాయాతి రాజు అన్నారు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

They are cheating innocent people

You cannot copy content of this page