తేదీ : 29/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా కనకదుర్గ అమ్మవారి కి పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రం మరియు దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు , సిరిసంపదలు , మంచి ఆరోగ్యం , కలిగి వాళ్లు చేసే వృత్తులలో లాభాలు పొందాలని , ఎటువంటి కష్టనష్టాలు రాకుండా, లేకుండా ఉండాలని దుర్గమ్మను మనస్ఫూర్తిగా కోరుకున్నామని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


