కూకట్పల్లి సెప్టెంబర్ 17 : (త్రినేత్రం న్యూస్) ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ వద్ద తెలంగాణ జనసేన ఇన్చార్జ్ నేమూరీ శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాధారం రాజలింగం, కూకట్ పల్లి ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, వీర మహిళా నాయకురాలు కావ్య మండపాక జాతీయ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకొని జన శ్రేణుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించాలని జనసేన తరుపున ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గం ఇంచార్జ్ లు మరియు గ్రేటర్ హైదరాబాద్ జనసేన నాయకులు , వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


