ధర ఖాస్తులకు మహిళా రైతుల నుండి ఆహ్వానం.
మండల వ్యవసాయ అధికారి- రెహానా.
డిండి(గుండ్ల పల్లి) ఆగస్టు 07 త్రినేత్రం న్యూస్. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పై ఉప -మిషన్. పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు 50%రాయితీపై ఇతరులకు 40 శాతం రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి రెహానా ఒక ప్రకటనలో తెలియజేశారు, మండలంలోని మహిళా రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మొత్తం 228 యూనిట్లు మండల పరిధిలో రాయితీపై అందించ నున్నమని తెలిపారు
రాయితీ నీ పొందేందుకు మహిళల పేరు మీద భూమి నమోదై వుండాలి. భూమి పాస్ బుక్,ఆధార్ కార్డు,ట్రాక్టర్ ఆర్ సి ,(ట్రాక్టర్ సంబంధిత పనిముట్లకు మాత్రమే) దరఖాస్తులు ఈనెల 14 తేదీ లోపల అసిస్టెంట్ వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల మహిళా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సంవత్సరం కేవలం మహిళా రైతులకు మాత్రమే ఇవ్వబడును.
ఈ రాయితీని పొందేందుకు మహిళల పేరు మీద భూమి నమోదు ఉండాలి. ట్రాక్టర్ పరికరాల కోసం అప్లికేషన్ చేసేవారు ఆర్ సి ఆడవారి పేరు మీద లేకున్నా భర్త పేరు మీద ఉన్న దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. దరఖాస్తులకు చివరి తేదీ 14-08-2025 వరకు అసిస్టెంట్ వ్యవసాయ అధికార్లకు సమర్పించాలని ఈ సందర్భంగా డిండి మండల వ్యవసాయ అధికారి అధికారి రెహానా తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


