Trinethram News : Aug 07, 2025, తెలంగాణ : బీసీ రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధేయపద్దతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి బలహీన వర్గాల నోటి కాడ ముద్దను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కిషన్రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి తమకేం సంబంధం లేదని కిషన్రెడ్డి మాట్లాడారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


