Assembly Key Leaders Meeting : రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం జిల్లా ఉపాధ్యక్షులు తనుబుద్ధి సూర్య భాస్కరరావు ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కరుటూరి శ్రీనివాసరావు ఇంటివద్ద సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర విచ్చేసి మండల అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలను దిశానిర్దేశం చేశారు.

అసెంబ్లీ నుండి నామినేటెడ్ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ యానాపు ఏసు, జిల్లా ఈఎస్ఐ డైరెక్టర్ ఒంటెద్దు స్వామి, ఏ ఏం సి డైరెక్టర్ పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, కడియం మండల సొసైటీ డైరెక్టర్ కొటికలపూడి వెంకటేశ్వరరావు, కడియం పూలవర్ధక సంఘం చైర్మన్ నాగులాపల్లి వీరబాబు ను అభినందించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి స్వామి సూర్య కిరణ్, ఉన్నికృష్ణన్ ఆకుల శ్రీధర్, మట్ట నాగబాబు నాగల శివకుమార్, బొరుసు సుబ్రమణ్యం, సింగవరపు రామకృష్ణ, బొప్పన లోవరాజు, దాసరిముత్యం వడ్డీ సూర్య చంద్రబాబు, పీవీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Assembly key leaders meeting

You cannot copy content of this page

Scroll to Top