MLA KP Vivekanand : పేద ప్రజల హృదయంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రజా నాయకులు కూన వెంకటేష్ గౌడ్

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 125 – గాజుల రామారం పరిధిలోని కె.వి.ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన “కూన వెంకటేష్ గౌడ్ విగ్రహావిష్కరణ” కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై కూన వెంకటేష్ విగ్రహానికి పూలమాలవేసి వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….నిరాడంబరుడు, పేదల పాలిటి పెన్నిధి కూన వెంకటేష్ గౌడ్ గారని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో పేదల అభ్యున్నతికై కృషిచేసిన నేత కూన వెంకటేష్ గౌడ్ ప్రజల గుండెల్లో కలకాలం ఉంటారన్నారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, గుబ్బల లక్ష్మీనారాయణ మూసా ఖాన్, ఇమ్రాన్ బేగ్, చెట్ల వెంకటేష్, సమ్మయ్య యాదవ్, హమీద్, శివా నాయక్, జునైద్, ప్రసాద్, వాహీద్, గుబ్బల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Koona Venkatesh Goud

You cannot copy content of this page

Scroll to Top