త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమండ్రి: కె ఆర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ప్రసన్నకుమార్, ప్రత్యేక ఆహ్వానం మేరకు, రాజానగరం నియోగజక వర్గ శాసన సభ్యులు, బత్తుల బలరామకృష్ణ,హాజరై, రాజమండ్రి శ్యామల సెంటర్ సమీపంలో గల కె ఆర్ ఇన్స్టిట్యూట్ అఫ్ లెర్నింగ్ కోచింగ్ సెంటర్ బత్తుల బలరామకృష్ణ, చేతుల మీదుగా ప్రారంభమైనది. అనంతరం బలరామకృష్ణ, మాట్లాడుతూ కెఆర్ ఇన్స్టిట్యూట్ నందు అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారని మరియు స్పోకెన్ హిందీ లాంటి అన్ని స్పోకెన్ లాంగ్వేజ్ లను అనుభవజ్ఞుల చే నేర్పించడం జరుగుతుందని, యువతీ యువకులు ఈ సేవలను ఉపయోగించుకొని వారి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ డి ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


