త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి : మానవాళికి వృక్షజాతి చేసే మేలులు తెలియజేయడానికి నారాయణ స్కూల్ నందు ఏ జి ఏం షేక్ అలీషా, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమం ర్యాలీ కన్నుల పండుగగా జరిగింది. పిల్లలు వివిధ రకములైన చిన్నమొక్కలు తీసుకుని దేవి చౌక్ వరకు ర్యాలీ చేస్తూ పలువురికి ఉచితంగా మొక్కలను పంపిణి చేశారు.
ప్రిన్సిపాల్ నందకుమార్ లు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను విరివిగా పెంచాలని విద్యార్థులకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఏవో ఆనంద్ కుమార్, కో ఆర్డినేటర్స్ సుశీల, మాధురి, గోపినాయుడు, వైస్ ప్రిన్సిపాల్స్ వెంకటరమణ, హరీష్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


