తేదీ : 15/07/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కరేడు గ్రామ రైతులు వైసిపి చిప్ జగన్ ను కలిశారు. ఇండో సోల్ సోలార్ పరిశ్రమ కోసం పచ్చని భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తోందని ఫిర్యాదు చేయడం జరిగింది. మూడు పంటలు పండే తమ భూములు లాక్కుంటే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు జగన్ ధైర్యం చెప్పాడు. వాళ్ల ఉద్యమానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. అవసరమైతే గ్రామంలో పర్యటిస్తానని ఆయన హామీ ఇచ్చారని వైసిపి ట్వీట్ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


