గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది ఐన వార్డ్ అసిస్టెంట్ లకి గ్రేడ్ హెచ్ ఇవ్వడం వలన ఆర్థికంగా నష్టపోతున్నామని, కోల్ ఇండియాలో అదే డెసిగ్నేషన్ కి గ్రేడ్ ‘ ఈ’ ఇస్తున్నారని ఏసీఎంవో దృష్టికి తీసుకెళ్లారు, సింగరేణిలో గ్రేడ్ ఈ చేరుకోవడానికి దాదాపు 20 సంవత్సరాల సమయం పడుతుందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏసీఎంవో డాక్టర్ అంబిక ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని వార్డు అసిస్టెంట్స్ కి హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సిబ్బంది దాసరి అనిల్, సంతోష్, భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


