Rajnath Singh : అల్లూరి వంటి గొప్ప యోధుడిని ఆంధ్రప్రదేశ్ అందించింది

TRINETHRAM NEWS

అల్లూరి జయంతి వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

హనుమంతుడి స్ఫూర్తితోనే ‘ఆపరేషన్ సిందూర్‌’ చేపట్టామని వెల్లడి

పాకిస్థాన్‌కు, ప్రపంచానికి మన బలమేంటో తెలిసిందన్న కేంద్ర మంత్రి

అల్లూరి పుట్టిన గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి

Trinethram News : హనుమంతుడి స్ఫూర్తితోనే పాకిస్థాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్‌’ను విజయవంతంగా పూర్తి చేశామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్‌తో పాటు యావత్ ప్రపంచానికి భారత్ బలమేంటో స్పష్టంగా చూపించామని ఆయన అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “మేము పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం తప్ప, అక్కడి సాధారణ పౌరులను కాదు” అని స్పష్టం చేశారు. అనంతరం అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.

“భారతదేశం కోసం అల్లూరి వంటి గొప్ప వీరుడిని ఆంధ్రప్రదేశ్ అందించింది. అడవి నుంచి విప్లవ జ్వాలను రగిలించి, గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీశాలి ఆయన” అని గుర్తుచేశారు. గిరిజనుల హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం అల్లూరి వీరోచితంగా పోరాడారని అన్నారు.

“బానిసత్వంతో కాకుండా ఆత్మాభిమానంతో బతకాలని అల్లూరి జీవితం మనకు నేర్పుతుంది” అని పేర్కొన్నారు. ఆయన జన్మించిన గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ సేవా సమితి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Andhra Pradesh gave birth

You cannot copy content of this page

Scroll to Top