వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ సార్ ఆదేశాల మేరకు. వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు కే గోపాల్ ముదిరాజ్ అధ్యక్షతన, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు ధన్నారం గ్రామానికి సంబందించిన బి ఆర్ యస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం వికారాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, వార్డు కమిటీల ఎంపిక, అనుబంధ కమిటీల ఎంపిక, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో విజయం విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
ఈ సమావేశంలో వికారాబాద్ మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు అనంత రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి , మంచన్పల్లి సురేష్, మల్లికార్జున్, మూర్తుజ్,దన్నారం మాజీ కౌన్సిలర్ రాములు, ఖాజా,వెంకటయ్య, పాండు, సమీర్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


