అయోధ్య రామునికి భారీ లడ్డూను తయారు చేసిన హైదరాబాద్ వాసి

TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్య శ్రీరామునికి నేడు భారీ లడ్డూ తరలివెళ్లనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామా కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం 1265 కేజీల భారీ లడ్డూను తయారు చేయించారు.

అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన నుంచి ప్రేమ ప్రతిష్టాపన చేసిన వరకు ఎన్ని రోజులు(1265) పట్టిందో అన్ని కేజీల లడ్డూను తయారు చేసినట్లు శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం తెలిపారు.

ఐతే ఈ భారీ లడ్డూను సికింద్రాబాద్ నుంచి అయోధ్య కు ఈ రోజు తరలిస్తున్నారు. ఈ యాత్రను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top