త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. విజయవాడ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వహణాధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


