Job Mela : జాబ్ మేళా ను విజయవంతం చేయాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న తాండూరులో నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈనెల 29న తాండూర్ లో నిర్వహించే జాబ్ మేళా పై తాండూరు శాసన సభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి తో కలిసి జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిక్ జైన్ మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ ఇజీఎంఎం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ను నిర్వహించడం జరుగుతుందన్నారు. 52 పారిశ్రామిక రంగాల్లో 11 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈనెల 29న తాండూర్ లో నిర్వహించే జాబ్ మేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాబ్ మేళాకు విచ్చేసే నిరుద్యోగులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్8 రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తాండూర్ లోని వినాయక కన్వెన్షన్ నందు జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు సమాచారాన్ని చేర వేసేందుకు అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. జాబ్ మేళాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా స్టాళ్లను ఏర్పాటు చేసి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సమన్వయ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఇజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణన్, జెడిఎం సతీష్, తాండూర్ సిడిపిఓ శ్రీలత, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, ఎంపీడీవోలు, ఎంపిఓలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Job Mela should be

You cannot copy content of this page

Scroll to Top