మంథని మే-25: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రోజున నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారి మరియు సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ టీం యుక్తంగా మంథని లోని ఆల్రెడీ ఫంక్షనల్ ఎదురుగా రేకుల షెడ్డు లోకి TS 02 UD 1387 వాహనం నుండి పిడిఎస్ సన్నబియ్యము దింపుతుండగా సివిల్ సప్లై అధికారులు అక్కడికి వెళ్ళగా వారిని చూసి డ్రైవర్ పారిపోయినాడు.
అట్టి బియ్యంతో ఉన్న బండిని పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా నల్లవెల్లి సది అనే వ్యక్తి అధికారులపై దుర్భాషలాడి అడ్డుపడగా అతనిపై మరియు అట్టి బండి ఓనర్ అయిన ఆరే సంజీవ్ డ్రైవర్ రమేష్ పై కేసు నమోదు చేయడమైనది అట్టి బియ్యం 29 క్వింటాళ్ల 20 కిలోలు దాని విలువ 1, 78120 గా ఉంది మంథని మండలంలో ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన మరియు అమ్మిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడును
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


