తేదీ : 28/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాన సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు వచ్చే మే నెలలో పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి నేతలకు టెలి కాన్ఫరెన్స్ లో వివరించడం జరిగింది. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ల కుట్రలను తిప్పి కొట్టాలని ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


