Trinethram News : Apr 25, 2025,ఆంధ్రప్రదేశ్ : 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షను జూన్ 1న నిర్వహించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఉ.10 నుంచి మ.1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించింది. ఇందులో మొత్తం 38,910 మంది అర్హత సాధించారు. వీరందరికీ తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


