తేదీ : 09/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అకాల వర్షాల కారణంగా ఈదురు గాలులు, రైతుల వెన్ను విర వడం జరుగుతుంది. రాష్ట్రంలో పది వేల, నూట అరవై ఐదు ఎకరాల వరి మూడువేల నూట అరవై ఐదు ఎకరాల మొక్కజొన్న,ఆరు వందల డెబ్బై ఎకరాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కాకినాడ, నంద్యాల, ఏలూరు ,యన్ టి ఆర్ జిల్లాల్లో ఈ పంటల నష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా యన్ టి ఆర్ జిల్లాలోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మైలవరం నియోజకవర్గం లో ఐదు వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగిందని అధికారులు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


