MPP Election : ఎంపీపీ ఎన్నికల్లో వ్యక్తిగత కారణాల వల్లే నేను ఓటు వేయలేకపోయాను

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. మార్చి 27వ తేదీన జరిగిన బిక్కవోలు ఎంపీపీ ఉప ఎన్నికల్లో తాను వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదన్న కొంకుదురు వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు పడాల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి. అనపర్తి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో కొంకుదురు వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు పడాల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ

ఎంపీపీ ఉప ఎన్నికల్లో 20 మంది ఎంపీటీసీ సభ్యులకు పది మంది సభ్యులు మాత్రమే ఎంపీపీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆ ఎన్నిక జరిగే సమయంలో వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేకపోయానని, తప్ప తనను ఎవరు ఇబ్బంది పెట్టలేదన్నారు. తాను హాజరైనా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే అవకాశం లేదని అన్నారు.

తను వ్యక్తిగత కారణాలతోనే హాజరుకాలేకపోయానని స్పష్టం చేసిన కొంకుదురు వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు పడాల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 vote in the MPP election

You cannot copy content of this page

Scroll to Top