జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో రోడ్డుపై పనిచేస్తున్న హైవే సిబ్బందిపై పాల మినీ ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. రోజువారీగా కూలి పనిచేస్తూ, రోడ్డుపై హెచ్చరిక బోర్డులు పెట్టి కూలీలు పనిచేస్తుండగా పాలమినీ ట్యాంకర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను వెనువెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
హైవే సిబ్బందిపై పాల మినీ ట్యాంకర్
Related Posts
MLA KP. Vivekanand : ధయ, ధర్మమార్గాన్ని ఎలా గడపాలో ప్రజలకు బోధించిన గొప్ప మహనీయుడు మహమ్మద్ ప్రవక్త : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
TRINETHRAM NEWS Prophet Muhammad, the great saint who taught people how to live the path of compassion and righteousness: MLA KP. Vivekanand Trinethram News : Medchal : ఈరోజు 128 –…
Kuna Srisailam Goud : మిలాద్ ఉన్ నబి’ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్
TRINETHRAM NEWS Former MLA and Congress leader Kuna Srisailam Goud participated in Milad Un Nabi celebrations Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఈరోజు చింతల్ డివిజన్ రోడా మేస్త్రి నగర్ ‘మజీద్…