“SI” of Mogullapalli : సివిల్ కేసులో తలదూర్చిన.. మొగుళ్ళపల్లి “ఎస్ఐ”

TRINETHRAM NEWS

సివిల్ కేసులో తలదూర్చిన.. మొగుళ్ళపల్లి “ఎస్ఐ”

బాదితిడు జిల్లా ఎస్పీ కి పిర్యాదు ఎంక్వైరీ చేయాలని సీఐను ఆదేశించిన జిల్లా ఎస్పీ కిరణ్ కరే.

భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మొగుళ్ళపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో పిన్నింటి రాజేశ్వర్ రావు అనే వ్యక్తి పొలానికి దారి కోసం బల్గూరి సంపత్ రావును భూమి వదలాలని వేధింపులకు గురిచేస్తున్నాడు మొగుళ్ళపల్లి ఎస్ఐ బొరగాల అశోక్. తాతల నాటి నుంచి వస్తున్న సొంత భూమిని ఇవ్వలేమన్న బల్గూరి సంపత్ రావును నవంబర్ 7వ తేదీన బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి భూమి ఇవ్వాలని బెదిరించి, బూతులు తిట్టాడు ఎస్ఐ బొరగాల అశోక్. సివిల్ విషయంలో దూరి తమను బెదిరిస్తున్నాడని, తమకు ప్రాణభయం ఉందని ఎస్ఐ అశోక్‌పై డీజీపీకి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరేకు ఫిర్యాదు చేసిన సంపత్ రావు కుమారుడు శశిధర్ రావు ఎస్ఐ అశోక్‌పై ఎంక్వైరీ చేయాలని సీఐను ఆదేశించిన జిల్లా ఎస్పీ కిరణ్ కరే

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

"SI" of Mogullapalli

You cannot copy content of this page

Scroll to Top