జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 15.31.47

TRINETHRAM NEWS

గాంధీ మార్గం సర్వత్రా అనుసరణీయం విశ్వ మానవాళికీ శ్రేయస్కరం

త్రినేత్రం న్యూస్: జనవరి 30: కావలి:పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు బాపూజీ వర్ధంతిని పురస్కరించుకునిట్రంక్ రోడ్డు లో గాంధీ విగ్రహానికి కూటమి నేతలతో కలిసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి స్వాతంత్ర్యపోరాటంలో అహింస సత్యాగ్రహం. అనేవి అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధాలని నిరూపించిన మహనీయులు మహాత్మా గాంధీ శాంతి ఉద్యామాలు ఓర్పు సాహసమే ఆసరాగా శతాబ్దాల బ్రిటిష్ పాలకుల దాస్య శృంఖలాలను తెంచి భారత జాతికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన కారణ జన్ముడు గాంధీ హింస ఉన్న చోట..

అశాంతి నెలకొన్న చోట మానవ మనుగడ అభివృద్ధికి అవకాశం ఉండదని ప్రపంచ వ్యాప్తంగా అనేక దృష్టాంతాలు నిరూపిస్తున్న క్రమంలో మహాత్ముడు చూపిన శాంతి మార్గమే శ్రేయస్కరమని చెబుతూ వారి బాటలో పయనించి నియోజకవర్గాన్ని,రాష్టాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపు ఇచ్చిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page