TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

గుండెపోటుతో తల్లీకొడుకు మృతి!

హైదరాబాద్ :

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది.

గుండెపోటుతో తల్లీకొడుకు మృతిచెందారు.

ఈ ఘటన హవేలి ఘనపుర్ మండలం కూచన్ పల్లిలో చోటుచేసుకుంది.

ఇవాళ తెల్లవారుజామున నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు.

కొడుకు మరణవార్త విని గుండెపోటుతో కుప్పకూలి లక్ష్మీ మృతి చెందింది.

తల్లీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.