ఆగస్ట్ 31, 2026

WhatsApp Image 2024 12 05 at 6.59.03 PM 1

TRINETHRAM NEWS

ప్రజా సమస్యల విభాగానికి గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ ఇన్చార్జిగా కేశవ బాబు
పెనుమూరు : గంగాధర్ నెల్లూరు ప్రజా సంకల్ప వేదిక పరిధిలో ప్రజా సమస్యల విభాగానికి గంగాధర్ నియోజకవర్గo ఇన్చార్జిగా పెనుమూరు మండలం అట్లవారిపల్లికి చెందిన తోకల కేసు బాబుని నియమించినట్లు ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మధిర రంగసాయి రెడ్డి ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు ఇన్చార్జి నియమించినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో గంగాధర్ నియోజకవర్గానికి తోకల కేశవ బాబు నియమించినట్లు తెలిపారు. కేశవ బాబు మాట్లాడుతూ ఇంతటి బాధ్యతను తనపై నమ్మకంతో అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు రంగసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన సాయి శక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ప్రజా సంకల్ప వేదిక సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page