TRINETHRAM NEWS

దేశ సరిహద్దుల్లో 4జీ కమ్యునికేషన్ కల్పిస్తున్న కేంద్రం

భారతదేశ సరిహద్దుల్లోని 1,117 బోర్డర్, ఇంటెలిజెన్స్ పోస్టులకు 4జీ మొబైల్ కమ్యునికేషన్ సౌకర్యాలు కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.

ఇందుకోసం కేంద్ర హోం శాఖ టెలికాం శాఖలో బీయస్ఎన్ఎల్ తో ఒప్పందం చేసుకొని దీని కోసం 1545 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దేశ సరిహద్దుల్లోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఈ ప్రాజెక్టును రానున్న ఆరేళ్ల లో పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.