KCR : కెసిఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసిన రోజు

TRINETHRAM NEWS

కెసిఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసిన రోజు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమంతో ప్రతి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాండూర్ మాజీ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి తో కలిసి కోటపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పరి మహేందర్, కోటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షులు రావిరాల ఆనంద్, కోటపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, మాజీ అధ్యక్షులు తమ్మలి శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు చిట్టెంపల్లి రత్నయ్య, బిచ్చయ్య, యువ నాయకులు, ఉప్పరి కృష్ణ, ఎర్రవల్లి నరసింహులు, తదితరులు పాలుపంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ వచ్చాడో కేసీఆర్ సచ్చుడో అనే ఉద్యమం తో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియమొదలైంది అని గుర్తు చేసుకోవడం జరిగింది. కెసిఆర్ తో ఉద్యమంలో పనిచేసిన పాతజ్ఞాపకాలనిగుర్తుచేసుకోవడం జరిగింది. నాడు కేసులకు, జైళ్లకు, భయపడకుండా ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుంది కావున తెలంగాణ పునర్నిర్మాణం భవిష్యత్ కార్యాచరణకు ఎలాంటి ఉద్యమాలు వచ్చిన టిఆర్ఎస్ పార్టీ సైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top