TRINETHRAM NEWS

కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో 80 పల్లె వెలుగు బస్సులు 30 ఎక్స్‌ప్రెస్ 30 రాజధాని ఏసీ 20 లహరి స్లీపర్ సీటర్‌లు అందు బాటులోకి వచ్చాయి హైదరాబాద్‌లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ శనివారం ప్రారంభించారు సంస్థ ఎండీ సజ్జనార్‌ ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు కార్మికుల సంక్షేమం ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు సీసీఎస్‌ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్టు ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు వీటిలో హైదరాబాద్‌కు 500ల బస్సులు జిల్లాలకు 500ల బస్సులు కేటాయించ నున్నట్టు వివరించారు.