WhatsApp Image 2024 10 11 at 18.05.03
గంజాయి కేసులో ఐదుగురి అరెస్టు
Oct 11, 2024, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
బెల్లంపల్లి గంజాయి కేసులో ఐదుగురి అరెస్టు
గంజాయి అక్రమంగా విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను మాదారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తాండూర్ సీఐ కుమారస్వామి తెలిపారు. మాదారం శివారులో గ్రామానికి చెందిన వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని సమాచారం అందడంతో ఎస్సై సౌజన్య సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 27, 500 విలువైన 1100 గ్రాముల గంజాయి, బైకు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
