TRINETHRAM NEWS

సీఎం కప్ 2024 నిర్వహణలో భాగంగా

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాష్ట్రంలోని 33 జిల్లాలలో టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి అక్కపాక సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు ఇందులో భాగంగా అక్టోబర్ 9వ తేదీన కరీంనగర్ నుంచి పెద్దపల్లి జిల్లాకు టార్చి వస్తున్న సందర్భంగా జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు పెద్దపెల్లి జిల్లా ఒలంపిక్స్ అధ్యక్ష కార్యదర్శులు ఆఫీస్ బేరర్స్ క్రీడా శాఖ అధ్యక్ష కార్యదర్శులు సీనియర్ క్రీడాకారులు పీఈటీల సంఘ ప్రతినిధులు అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యాయులు యువజన నాయకులు ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు అందరూ పాల్గొని టార్చ్ ర్యాలీని విజయవంతం చేయవలసినదిగా కోరారు ఈ ర్యాలీలో భాగంగా మధ్యాహ్నం 3:30 గంటలకు పెద్దపెల్లి జిల్లాలోని నారాయణపూర్ ఎక్స్ రోడ్ నుండి ప్రారంభమై సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలోని కలెక్టర్ ఆఫీస్ కు చేరుకోవడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, పెద్దపల్లి ఎమ్మెల్యే, రామగుండం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్లు, మండల అధికారులు , పెద్దపల్లి పోలీస్ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App