TRINETHRAM NEWS

ఆళ్లగడ్డలో హైటెన్షన్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆళ్లగడ్డలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి అఖిలప్రియ ప్రయత్నించారు. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కారును ముందుకు వెళ్లనివ్వాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి టీడీపీ కార్యకర్తలు వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ కొనసాగుతోంది.