తెలంగాణాలో మహిళను వేధించిన ఎస్ఐ సస్పెండ్

TRINETHRAM NEWS

తెలంగాణాలో మహిళను వేధించిన ఎస్ఐ సస్పెండ్

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో మియాపూర్ ఎస్ఐ గిరీష్ కుమార్ ను ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కారణం చేత సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు.

తన స్నేహితుడు వ్యాపారంలో 6 లక్షలు మోసం చేశాడంటూ భాధితురాలు మియాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా మియాపూర్ ఎస్ఐ గిరీష్ కుమార్ ఆ డబ్బును రికవరీ చేయించాడు.

ఐతే రికవరీ చేయించాక కూడా భాదితురాలికి ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో పూర్తి ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించటంతో ఎస్ఐ గిరీష్ కుమార్ పై వేటు పడింది.

You cannot copy content of this page

Scroll to Top