TRINETHRAM NEWS

స్వామి అయ్యప్ప దేవస్థానం నెల్లూరు

స్థానిక వేదయపాలెం స్వామి అయ్యప్ప దేవస్థానం నందు అయ్యప్ప స్వామి వారికి కేరళ సాంప్రదాయమండల పూజల సందర్భంగా శని వారం ఘనంగా ఉష పూజ,ఉచ్చ పూజ, అత్తాలపూజ,శ్రీ వేలి ఉత్సవం నిర్వహించారు.
మండల పూజలకు మరియు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమాలకు
ఉభయ కర్తలుగా పులి పుల్లయ్య యాదవ్ నారాయణమ్మ దంపతులు, రాచర్ల రవికుమార్ యాదవ్ బుజ్జమ్మ దంపతులు, మురళీమోహన్ సుధారాణి దంపతులు వ్యవహరించారు.
ఈ కార్యక్రమం అధ్యక్షులు గూడల శేషగిరిరావు ,కార్యదర్శి కత్తుల వెంకటరత్నం, కోశాధికారి గడ్డం రత్నయ్య, పి టి జగన్నాథం,కత్తి మోహనరావు, కేజీ శంకరన్ ,బొగ్గుల మురళీమోహన్ రెడ్డి పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.