ఓటెత్తిన‌ చైతన్యం… ఆ తాండాలో 100% వంద శాతం పోలింగ్

TRINETHRAM NEWS

Trinethram News : ఓట్ల పండుగ లో వీరు ప్రత్యేకం
వీరి స్ఫూర్తి శిఖరం
నగరవాసుల్లో నిల్
తండావాసులలో ఫుల్.

ఓటెత్తిన‌ చైతన్యం… ఆ తాండాలో 100% వంద శాతం పోలింగ్…
రంగారెడ్డి జిల్లా కొల్చారం మండల పరిధిలోని సంగాయిపేట తాండా వాసులకు 210 ఓటర్లు ఉండగా అందరూ తమ ఓటు వినియోగించుకున్నారు..
గతంలో వీరి తాండాకు పోలింగ్ కేంద్రం లేక పోయున రెండు కిలోమీటర్ల నడచి వెళ్ళి‌ ఓట్లు వేసేవారు..వీరి ఉత్సాహం గుర్తిస్తూ ప్రభుత్వం ‌ఇక్కడే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం తో 100% ఓట్లు వేసి నగర / పట్టణ వాసులకు సవాలు విసిరారు..
ఇదిలా ఉండగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి చెందిన మాజీ జెడ్పీటీసీ గాదె సత్యనారాయణ (75) ఆక్సిజన్ మాస్క్ ధరించి పక్కన సిలిండర్.. సహాయకుడితో వచ్చి స్థానిక పోలింగ్్బూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు…
ఇక నైన ప్రతి ఒక్క పౌరుడు వీరిని ఆదర్శంగా తీసుకొని,,, ఓటు వేయడం బరువు కాదు భాద్యతని మారాలని…
అలాగే 100% వంద శాతం ఓటు హక్కు వినియోగించుకున్న ఆ గ్రామం వారికి గౌరవ పురస్కారాలు అందిస్తూ,,, నిధులు కేటాయించాలని G.O తీసుకుని రావాలని‌ కోరుకుంటున్నాము….

✍️ రవీందర్ ముదిరాజ్,,
సూరారం కాలనీ, కుత్బుల్లాపూర్ ,మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా

సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు

+919849354039

You cannot copy content of this page

Scroll to Top