వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు

TRINETHRAM NEWS

పల్నాడు జిల్లా.

వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ రోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు. కార్ లోఉన్న వారి కుమారుడి గాయాలు పాలయ్యడు.

స్థానిక ప్రజలు వినుకొండ పోలీస్ లకు సమాచారం తెలపటం తో వినుకొండ సీ.ఐ. సాంబశివరావు. పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్రెన్ ద్వారా కార్ ను పక్కకు తొలిగించి. మృతులను పోస్ట్ మర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. క్షతగాత్రున్ని కూడ ఓ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top