WhatsApp Image 2024 03 30 at 08.07.42 1
Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అదే విధంగా పలు శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
