TRINETHRAM NEWS

Trinethram News : AP: అధికారంలోకి వచ్చేందుకు అప్పటికప్పుడు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారని చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. పార్టీని మాఫియా ముఠాలా తయారు చేశారని దుయ్యబట్టారు. విజయవాడలో ‘మహా దోపిడీ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. బాబు దోపిడీలు, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు. మరోసారి రాక్షసుల ముఠా ఏకమైందని టీడీపీ కూటమిపై విమర్శలు చేశారు.