WhatsApp Image 2023 12 21 at 2.48.03 PM
Chandrababu: గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు..
విజయవాడ: టీడీపీ చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu), సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) తో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు..
అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. మేరీమాత ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు వర్ల రామయ్య, జవహర్, దేవినేని ఉమ, అశోక్ బాబు, కొల్లు రవీంద్ర, నాగుల్ మీరా స్వాగతం పలికారు. జైలు నుంచి వచ్చాక పలు పుణ్య క్షేత్రాలను చంద్రబాబు సందర్శించిన విషయం తెలిసిందే. గుణదల మేరీ మాత ఆలయం నుంచి చంద్రబాబు దంపతులు ఇంటికి బయలుదేరి వెళ్లారు..
