Trinethram News : సిద్దిపేట నియోజకవర్గం పదిలో ప్రథమ స్థానం లో నిలవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు.హరీష్ రావు
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్… ఈ పాఠశాల దినదిన అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో ఈ పాఠశాల వర్షం వస్తే పెచ్చులు ఉడుతాయని బంద్ చేసేది, నేడు కార్పొరేట్ స్కూల్ నీ తలదన్నేలా ఉందన్నారు.
50లక్షల సిఎస్ఆర్ నిధులతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాం అని… త్వరలోనే ఈ పాఠశాలకు కంప్యూటర్ ఇన్స్తక్టర్ ను ఏర్పాటు చేస్తాం అన్నారు. రాబోయే కాలం మొత్తం కంప్యూటర్ కాలమే కావున విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలని…కంప్యూటర్ పరిజ్ఞానం జీవన విధానం లో భాగమైందన్నారు. జిల్లాలో ఎక్కువ మంది ఆడపిల్లలు చదివే పాఠశాల ఇది అన్నారు.
ఈసారి ఈ పాఠశాల పదవ తరగతి లో వందశాతం పలితాలు సాధించాలని.. మీరు బాగా చదవండి భవిష్యత్ మీ చేతిలోనే ఉందన్నారు. మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పదిలో 10 gpa, 100 శాతం మార్కులు సాధించాలన్నారు.


