WhatsApp Image 2024 02 18 at 15.40.51
Trinethram News : శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ లోని ప్రియదర్శిని హాస్టల్లోమొదటి అంతస్తులో ఘటన.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వేణుగోపాల్ పురం కు చెందిన విద్యార్థిని టి .శశి (17) గా గుర్తింపు.
పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి.
అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య.
ప్రవల్లిక ,వర్ధిని ,విష్ణుప్రియ ,లతో అదే రూములో కలిసి ఉంటున్న విద్యార్థి
అర్ధరాత్రి వరకు చదువుకున్న తోటి విద్యార్థులు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో నిద్ర లేచి చూడడంతో ఉరివేసుకున్నట్లు గ్రహించి కేర్ టేకర్ కుమారికి సమాచారం.
విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వి.రమణ పోలీసులకు విషయం తెలిపివేత.
తిరుపతి రూరల్ పోలీసులు తో పాటు మహిళ ఎస్సై అరుణ ఆధ్వర్యంలో విచారణ.
సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలోకి……
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా మార్చురీకి తరలించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు.
